ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్ ద్వారా వేయి ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
అవుటర్ రింగ్ రోడ్డుకు, ప్రాంతీయరింగ్ రోడ్డుకు మధ్య లేఔట్ లు అభివృద్ధి చేసి వేలం వేస్తే హెచ్ఎండిఏకు ఆదాయంతోపాటు, మధ్యతరగతి వారికి ధరలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్ ద్వారా వేయి ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇన్ ముల్ నర్వ లో 95.25 ఎకరాల్లో లేఔట్ అభివృద్ధి చేసి, లేమూరులో 83.48 ఎకరాల్లో లేఔట్లను అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు.
హెచ్ఎండిఏ లేఅవుట్ల కోసం గుర్తించిన భూముల్లో దాదాపు సాగులో లేనివే. అవి అసైన్డ్ కేటగిరీలో ఉండటంతో రైతులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సేకరించిన భూమిని హెచ్ఎండిఏ అభివృద్ధి చేసి లేఅవుట్ కింద తీర్చిదిద్దుతుంది. రైతు భూ యజమానిగా, హెచ్ఎండిఏ డెవలపర్ గా ఉంటుంది. ఇందులో రైతులకు 60 శాతం బదిలీ చేస్తుంది. మిగతా 40 శాతం హెచ్ఎండిఏ విక్రయిస్తుంది. ల్యాండ్ పూలింగ్ లో భాగంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్గిరి పరిధిలో దాదాపు 924.28 ఎకరాలు అధికారులు పరిశీలించారు.
ఆదాయం పెంపు దిశగా అడుగులు
హెచ్ఎండిఏ పై ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి సారించింది. రూ. 500 కోట్ల వరకు మౌలిక వసతులకు కేటాయించింది. అవుటర్ రింగ్ రోడ్డుకు, ప్రాంతీయరింగ్ రోడ్డుకు మధ్య లేఔట్ లు అభివృద్ధి చేసి వేలం వేస్తే హెచ్ఎండిఏకు ఆదాయంతోపాటు, మధ్యతరగతి వారికి ధరలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ లో 355, బోగారంలో 125, ప్రతాప్సింగారంలో 152, నాదర్గుల్ లో 91 ఎకరాల్లో లేఅవుట్లు తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం
ఈ వారం నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభం
ప్లాట్లకు మూడు దశల్లో, లేఔట్లకు నాలుగు దశల్లో పరిశీలన
రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు ప్లాట్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడు నెలల్లో దరఖాస్తులను పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి ఎం దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాట్ల దరఖాస్తులను మూడు దశల్లో లేఅవుట్ల దరఖాస్తులను నాలుగు దశల్లో పరిశీలించాలని నిబంధనలో పేర్కొన్నారు. అనంతరం వాటిలో అర్హమైన వాటిని నిర్ధారిత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు.
25 లక్షల దరఖాస్తులు
స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 2020లో సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేశారు కోర్ట్ లో కేసులు ఉండడంతో అవి పరిష్కారానికి నోచుకోలేదు. ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి మాత్రం కోర్టు తీర్పునకు లోబడి ఉంటామంటూ అఫిడవిట్ తీసుకొని అధికారులు అనుమతులు ఇస్తున్నారు. గత డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన నాటినుండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర్వుల జారీ తో దరఖాస్తుదారులను హర్షం వ్యక్తం అవుతుంది.
ముందుగా సిజిజి పరిశీలన
ఆ దరఖాస్తులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ముందుగా పరిశీలిస్తుంది. వివిధ నిబంధనల ఆధారంగా కంప్యూటర్ ద్వారా వడపోస్తుంది. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే గుర్తించి దరఖాస్తుదారులకు సమాచారం పంపుతుంది. దరఖాస్తుదారులు అవసరమైన పూర్తిస్థాయి పత్రాలు ఇవ్వకుంటే దానిపైన సమాచారాన్ని పంపుతుంది.
సి జి జి వడపోత తరువాత మిగిలిన దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. నాళాలు, చెరువులు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు తదితర కోణాల్లో పరిశీలించి అభ్యంతరాలను నమోదు చేస్తారు. ఆయా వివరాలను ఇప్పటికే సిజిజి రూపొందించిన సెల్ ఫోన్ యాప్ లలో నమోదు చేస్తారు
రెండో దశలో
మరింత అధ్యయనం చేసి అర్హమైన నిర్ధారిత ఫీజు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హమైనవి కాదని గుర్తిస్తే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఆ సమాచారాన్ని దరఖాస్తుదారులకు పంపుతారు.
మూడో దశలో
అర్హమైన దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్ధీకరణ ఉత్తర్వులను జారీ చేస్తారు.
లే అవుట్ల విషయంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని వివిధ విభాగాల అధికారులు పరిశీలన చేస్తారు
సహాయ కేంద్రాల ఏర్పాటు
క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు స్థానిక సంస్థ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలు భాగస్వాములయ్యే అన్ని స్థాయిల సిబ్బంది అధికారులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
జిహెచ్ఎంసీ కి 3065 కోట్లు, జలమండలికి 3385 కోట్లు, మూసి సుందరీకరణ 1500 కోట్లు, ఎం ఎం టి ఎస్ 50 కోట్లు, హెచ్ ఎం డి ఏ 500 కోట్లు, హైడ్రా 200 కోట్లు, ఎయిర్ పోర్ట్ మెట్రో 100 కోట్లు, హైదరాబాద్ మెట్రో 500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రో 500 కోట్లు, ఓఆర్ఆర్ 200 కోట్లు నిధుల కేటాయింపు
మెట్రో రైలు విస్తరణ కోసం సమగ్ర ప్రణాళిక
హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత మెట్రో రైలు విస్తరణ ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళిక కనెక్టివిటీని మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, మరియు సుస్థిర పట్టణ అభివృద్ధికి తోడ్పడడం లక్ష్యంగా ఉంది. ప్రస్తుత మెట్రో మార్గాలను పాత నగరం మరియు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిపేలా విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టుల కొరకు కేటాయింపు:
పాత నగరం మెట్రో విస్తరణ: రూ 500 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్: రూ 500 కోట్లు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విస్తరణ: రూ 100 కోట్లు
ఇతర రవాణా మార్గాలతో సమర్థవంతమైన అనుసంధానం, ప్రయాణికుల సౌలభ్యం మరియు సమర్థవంతమైన ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం అధునాతన సాంకేతికతల స్వీకరణపై దృష్టి పెట్టనున్నారు.
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కోసం నిధుల కేటాయింపు
రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్ట్ నగర కేంద్రాన్ని రద్దీ చేయకుండా చేసేందుకు మరియు ప్రాంతీయ సమతుల అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ 1,525 కోట్లు కేటాయించింది. ఆర్ఆర్ఆర్ నగర చుట్టూ ట్రాఫిక్ ప్రవాహం సాఫీగా ఉండేలా చేయడం, ప్రధాన రహదారులను అనుసంధానం చేయడం మరియు పర్యవసాన ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడం. ఈ ప్రాజెక్ట్ సురక్షితంగా మరియు సమర్థవంతంగా ఉండేందుకు సర్వీస్ రోడ్లు, ఫ్లైఓవర్లు మరియు అండర్పాస్లు వంటి సహాయ మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా కలిగి ఉంటుంది.
మూసి నది శుభ్రత మరియు సుందరీకరణ కోసం సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)
మూసి రివర్ఫ్రంట్ ప్రాజెక్ట్ ఒక ప్రాముఖ్యత కలిగిన పర్యావరణ మరియు పట్టణ అభివృద్ధి కార్యక్రమం, దీని బడ్జెట్ కేటాయింపు రూ 1,500 కోట్లు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) క్రింది భాగాలను కలిగి ఉంటుంది:
నది శుభ్రత: కాలుష్యాలను తొలగించి నది యొక్క పర్యావరణ సంతులనం పునరుద్ధరించడానికి అధునాతన నీటి శుద్ధి సాంకేతికతలను అమలు చేయడం.
సుందరీకరణ: నది తీరం పక్కన పార్కులు, ప్రొమెనేడ్లు మరియు వినోద ప్రాంతాల అభివృద్ధి చేయడం ద్వారా అందాన్ని మెరుగుపరచడం మరియు ప్రజలకు బహిరంగ ప్రదేశాలను అందించడం.
తెలంగాణ ప్రభుత్వం నగర చుట్టూ శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణాన్ని ప్రోత్సహించే ప్రణాళికలను ప్రకటించింది, ఇవి ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నట్లుగా, ఈ టౌన్షిప్లలో పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలతో తక్కువ ధరలో నివాస గృహాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మెట్రో రైలును పొడిగించి, నగరంలోని వివిధ వర్గాల అవసరాలను పరిష్కరించడం ద్వారా, నగరంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం 24,042 కోట్ల అంచనా వ్యయంతో 78.4 కిలోమీటర్ల మేర ఐదు అదనపు మెట్రో కారిడార్లను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా, ఓల్డ్ సిటీ వరకు మెట్రో రైలును పొడిగించి, శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేయనున్నారు.
కాగా, నాగోల్, ఎల్బీనగర్ నుంచి మెట్రోను పొడిగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నాగోల్, ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట మెట్రో స్టేషన్లను ఇంటర్ఛేంజ్ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఎల్బీ నగర్ నుంచి హయత్నగర్ వరకు, మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రో రైలు సౌకర్యాలను పొడిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేస్తోంది. అదనంగా, హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలను కోర్ అర్బన్ ప్రాంతాలుగా గుర్తించి, వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డును హైదరాబాద్ మెట్రో సిటీకి సరిహద్దుగా పరిగణించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో విపత్తు నిర్వహణ కోసం ఏకీకృత సంస్థను ఏర్పాటు చేయడంతోపాటు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలను దాని పరిధిలోకి చేర్చేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఈ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉంటుంది. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, నదీతీరంలో కొత్త వాణిజ్య మరియు నివాస కేంద్రాలను ఏర్పాటు చేయడం మరియు పాత వారసత్వ ప్రాంతాల శోభను పెంపొందించడం కోసం కృషి చేస్తోంది.
లండన్లోని థేమ్స్ నది తరహాలో మూసీ నది మరియు దాని పరిసర ప్రాంతాలను పునరుజ్జీవింపజేయడం, అభివృద్ధి చేయడం మరియు సుందరీకరించడం లక్ష్యంగా పెట్టుకున్న మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం, ప్రభుత్వం మొదటి దశకు రూ.1,500 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్లో రిక్రియేషనల్ జోన్లు, పాదచారుల జోన్లు, పిల్లల థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు మరియు పీపుల్స్ ప్లాజాల అభివృద్ధి ఉంటాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కోసం రూ.3,065 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.500 కోట్లు మరియు మెట్రో వాటర్ పనులకు రూ.3,385 కోట్లు కేటాయించారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో రైల్ విస్తరణకు బడ్జెట్లో రూ.100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రో పొడిగింపుకు రూ.500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు రవాణా వ్యవస్థకు రూ.50 కోట్లు కేటాయించారు.
ఉత్తర ప్రాంతంలోని సంగారెడ్డి నుంచి తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ వరకు 158.6 కిలోమీటర్ల రహదారిని మరియు దక్షిణ ప్రాంతంలోని చౌటుప్పల్ నుంచి షాద్నగర్, సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారి హోదాగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణ ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)ను ప్రారంభంలో నాలుగు లేన్లతో నిర్మించి, తర్వాత ఎనిమిది లేన్లుగా విస్తరించాలని యోచిస్తోంది.
ముందస్తు అంచనాల ప్రకారం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర ప్రాంత అభివృద్ధికి రూ.13,522 కోట్లు మరియు దక్షిణాది అభివృద్ధికి దాదాపు రూ.12,980 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కోసం రూ.1,525 కోట్లు కేటాయించారు. చారిత్రాత్మకంగా, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరాన్ని పద్దతిగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
గతంలో ౩౦౦ అడుగుల వెడల్పుతో 338 కిలోమీటర్ల మేర రీజినల్ రింగురోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాని ఆ ౩౦౦ అడుగుల వెడల్పు ఉన్న రోడ్డు భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ ను తట్టుకునే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో 500 అడుగుల వెడల్పుతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ రీజినల్ రింగురోడ్డును సాధారణ రహదారిగా కాకుండా ప్రపంచస్థాయి ఎక్స్ప్రెస్వేగా నిర్మించాలని అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఆ దిశగా డీపీఆర్ తయారుచేయాలని, దీనికి నిధుల మంజూరు కోసం కేంద్రంతో మాట్లాడుతానని చెప్పారు. సీఎం గురువారం ప్రగతిభవన్లో సీఎస్ ఎస్కే జోషి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి ఇతర అధికారులతో సమావేశమై రీజినల్ రింగురోడ్డుపై చర్చించారు. రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కూడా సీఎం ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్ నగరం దేశంలోనే గొప్ప కాస్మోపాలిటన్ నగరం. ఇక్కడి వాతావరణ అనుకూలత , సామరస్య జీవన విధానం కారణంగా ఈ నగరం ఇంకా అభివృద్ది చెందుతుంది. దేశం నలుమూలల నుంచి హైదరాబాద్కు రాకపోకలు పెరుగుతాయి. ఇప్పుడున్న ఔటర్ రింగురోడ్డు భవిష్యత్ అవసరాలను తీర్చలేదు. కాబట్టి హైదరాబాద్ చుట్టూ మరో రింగురోడ్డును రీజినల్ రింగురోడ్డు పేరుతో (RRR-Regional Ring Road) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సంగారెడ్డి- గజ్వేల్- చౌటుప్పల్- మాల్- కడ్తాల్- షాద్నగర్- చేవెళ్ల- కంది పట్టణాలను కలుపుతూ 338 కిలోమీటర్ల మేర 500 అడుగుల వెడల్పుతో ఈ రహదారి నిర్మాణం జరుగాలి. ముంబై- పుణె, అహ్మదాబాద్- వడోదర మధ్య ప్రస్తుతమున్న ఎక్స్ప్రెస్వేల కంటే మన రీజినల్ రింగురోడ్డు గొప్పగా ఉండాలి. విజయవాడ, ముంబై, బెంగళూరు, నాగపూర్ నగరాలకు వెళ్లే మార్గంలో జంక్షన్లను బాగా అభివృద్ధి చేయాలి. ఆ నాలుగు జంక్షన్ల్ల వద్ద ప్రభుత్వం 300 ఎకరాల నుంచి 500 ఎకరాల వరకు సేకరిస్తుంది. ఆ స్థలంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. అక్కడ పార్కింగ్, ఫుడ్కోర్టులు, రెస్ట్రూంలు, పార్కులు, పిల్లల ప్లే ఏరియా, షాపింగ్ మాల్స్, మంచినీరు, టాయిలెట్లు.. ఇలా అన్ని రకాల వసతులుండాలి. దేశంలోనే ఈ రహదారి అతిగొప్ప రహదారిగా ఉండాలి. ఇందుకోసం మంచి రహదారులు, రహదారుల పక్కన సకల సౌకర్యాలు కలిగిన దేశాల్లో పర్యటించి అధ్యయనం చేయాలి అని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.
హైదరాబాద్ హెచ్ఎండిఏ (HMDA)పరిధిలో 28 కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ శివారులో గ్రామపంచాయితీలు గా ఉండి, జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన ప్రభుత్వం, వాటిని కొత్త మున్సిపాలిటీలుగా మార్చింది.
మెదక్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు, మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, రంగారెడ్డి జిల్లాలో 8 మున్సిపాలిటీలు, సంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపాలిటీలు, యాదాద్రి భువనగిరి జిల్లా (2) కొత్తగా వెలిశాయి. అదే యాదాద్రి జిల్లాలో వైటిడిఏ (YTDA)పరిధిలో యాదగిరిగుట్టను కూడా మున్సిపాలిటీ చేశారు.
సంగారెడ్డి జిల్లా (౩) : బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్
యాదాద్రి భువనగిరి జిల్లా (2+1) : చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట
పైన చెప్పిన ప్రాంతాలలో రోడ్లు మరియు ఇతర ప్రజా సౌకర్యాలు మెరుగుపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతాలలో ప్లాట్ల పై పెట్టుబడి ఎక్కువ లాభాలను ఇస్తుంది.
యాదగిరిగుట్టను ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ రూపు రేఖలు సమూలంగా మార్చుతున్నారు. దేవాలయం చుట్టూ గిరిప్రదక్షిణకు అనువుగా రోడ్ల నిర్మాణం, యాదగిరిగుట్టకు వచ్చే ప్రధాన రోడ్లను 150 ఫీట్లతో 6 వరుసల రోడ్లుగా మార్చడం, ప్రధాన రోడ్లను కలిపే రింగు రోడ్డు, యాత్రికులకు కావలసిన వసతి సౌకర్యాల కల్పన, చెరువులను, అడవులను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దడం వంటి అభివృద్ధి పనులతోపాటు యాదగిరిగుట్టను తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రంగా , యాత్ర స్థలంగా తీర్చిదిద్దడానికి ఏకంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించి , ప్రధాన నగరంగా అభివృద్ధి చేస్తున్నారు.
ఇదంతా గుట్టను అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రక్రియ అయితే దీనిని ఆధారంగా చేసుకొని మరో నగరం యాదగిరిగుట్టకు 6 కి మీ ల దూరంలో మాసాయిపేటలో అన్ని హంగులతో అభివృద్ధి చేయబోతున్నారు. ఈ నగరం కూడా ఏర్పాటైతే యాదగిరిగుట్ట జంట నగరాలుగా రూపుదిద్దుకుంటుంది. ఈ కొత్త నగరమే “సిద్ధ క్షేత్ర ధాం”.
సిద్ధ క్షేత్ర ధాం ను శ్రీ అభ్యసేన్ సురేశ్వర్ జీ మహారాజ్ గారి ఆద్వర్యంలో సహయోగ ట్రస్ట్ వారు 1000 ఎకరాలలో నిర్మించడానికి ప్రణాలికలు రూపొందించారు. ఇందులో భాగంగా 125 ఎకరాలలో 3185 కోట్లతో మొదటి దశలో విద్యాలయాలు, కళాశాలలు, సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులు, త్రీ డి ఐ మాక్స్ థియేటర్, క్రికెట్ స్టేడియం, ఇతర ఆట స్థలాలు,గోశాల మరియు నివాస గృహాలతో టౌన్షిప్ కూడా అభివృద్ధి చేయనున్నారు.
సిద్ధ క్షేత్ర ధాం వల్ల మాసాయిపేట శివారు లో ఉన్న వెంచర్లకు గిరాకి పెరిగింది. ఈ ప్రాజెక్ట్ చుట్టూ రియల్ ఎస్టేట్ ప్లాటింగ్ వెంచర్లు వెలిసాయి. భవిష్యత్తులో కాబోయే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్లాట్లపై పెట్టుబడి పెడుతున్నారు.
ప్రభుత్వ నిబందనల ప్రకారం ఇక్కడ డిటిసిపి అప్రూవల్ ఉన్న వెంచర్లలో మాత్రమే ప్లాట్లు కొనాలి. డిటిసిపి అప్రూవల్ ఉన్నప్లాట్లు కొనడం వల్ల న్యాయ పరమైన మరియు సాంకేతిక పరమైన సమస్యలు ఉండవు.
నగరానికి దూరంగా ఎక్కడో అడవిలో ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారా ? చీకట్లో సైతం ఎటువంటి అపాయం లేకుండా వన్య ప్రాణుల మధ్య సంచరించాలనుకుంటున్నారా ? అయితే మీ కోరిక హైదరాబాద్ లోనే నెరవేరబోతుంది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో కొత్వాల్ గూడలో 125 ఎకరాలలో సింగపూర్ తరహ నైట్ సఫారి పార్క్ ఏర్పాటు చేయడానికి హెచ్ ఎం డి ఏ సన్నాహాలు చేస్తుంది.
హైదరాబాద్ లో
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న కొత్వాల్ గూడను నైట్ సఫారి పార్క్ ఏర్పాటు చేయడానికి తగిన స్థలంగా గుర్తించారు. 80 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇంకా 45 ఎకరాల స్థలం సేకరించవలసి ఉంది. ఈ నైట్ సఫారి పార్క్ కొత్త అనుభూతులను అందిస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇది భాగ్యనగరానికే తలమానికంగా నిలుస్తుందని హెచ్ఎండిఏ కమీషనర్ చిరంజీవులు అన్నారు.
సింగపూర్ లో నైట్ సఫారి పార్క్ ఎలా ఉంటుందో కింది విడియోలో చూడవచ్చు