మునిసిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె టి రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 9000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుందని, హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం భూ దాతలకు తగిన పరిహారం చెల్లిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఫార్మా నగరానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు.
ఫార్మా సిటీని జాతీయ స్థాయిలో గుర్తించాల్సిన అవసరం ఉందని కెటిఆర్ వివరించారు. మేము డిపిఆర్ ను సిద్ధం చేసి, రాష్ట్ర భూసేకరణ చట్టం ప్రకారం అవసరమైన భూసేకరణ ప్రారంభించాము. అయితే ఫార్మా సిటీ ప్రాజెక్టులో యజమానులకు వేరే భూమి లేదని ఆయన స్పష్టం చేశారు.
ఫార్మా సిటీ కోసం భూసేకరణకు స్థానిక నాయకులు, యువత ప్రోత్సహిస్తున్నారని మంత్రి చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం భూ యజమానులకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక ప్రతిభావంతులకు మరియు యువతకు ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలను అందించే ఫార్మా సిటీ కోసం మరికొంత భూమిని మేము సేకరిస్తాము. ప్రతిపాదించిన ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలను పొందడానికి స్థానిక ప్రతిభావంతులకు మరియు యువతకు ప్రాధాన్యత ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సాహాన్ని పెంచడానికి ప్రభుత్వం ఈ భూమిని పెద్ద ఎత్తున సేకరించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కంపెనీలను ప్రోత్సహించడం మరియు ప్రతిభ కలిగిన యువతకు భారీ ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలను అందించడం మా ప్రణాళిక.
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఫార్మా సిటీ నిబంధనల ప్రకారం ఉత్పత్తిని ప్రారంభిస్తుందని కెటిఆర్ తెలిపారు. కేటాయించిన భూమిని ప్రయోజనం కోసం ఉపయోగించడంలో విఫలమైతే పరిశ్రమలు, వ్యాపారవేత్తల నుంచి ప్రభుత్వం భూములను తిరిగి తీసుకుంటుంది.
అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ మున్సిపల్ శాఖ అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 31.08.2020 నుంచి లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ ప్రారంభించినట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఆగస్టు 26 లోపు చేసిన లే అవుట్ ఓనర్లకు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ ఓనర్లకు ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఎల్ఆర్ఎస్కు సంబంధించి మున్సిపల్ శాఖ మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ కింది మార్గదర్శకాలకు లోబడే లే అవుట్లను రెగ్యులర్ చేస్తామని అధికారులు తెలిపారు.
⇒ నాలాకు 2 మీటర్ల దూరం ఉండాలి. ⇒ వాగుకు 9 మీటర్ల దూరం ఉండాలి. ⇒ 10 హెక్టార్లలోపు ఉన్న చెరువుకు 9 మీటర్ల దూరం ఉండాలి . ⇒ 10 హెక్టార్ల కంటే ఎక్ఖవ విస్తీర్ణం లో ఉన్న చెరువుకు 30 మీటర్ల దూరం ఉండాలి. ⇒ ఎయిర్పోర్టు, డిఫెన్స్ స్థలానికి 500 మీటర్ల దూరం ఉండాలి. ⇒ వ్యక్తిగత ప్లాట్ ఓనర్స్ వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, లే అవుట్ ఓనర్స్ 10 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ⇒ 100 మీటర్ల లోపు ఉన్న వారు గజానికి 200 రూపాయల చొప్పున చెల్లించాలి. ⇒ 101 నుంచి 300 మీటర్ల ఉన్నవాళ్లు గజానికి 400 రూపాయలు చెల్లించాలి. ⇒ 301 నుంచి 500 మీటర్ల ఉన్నవాళ్లు గజానికి 600 రూపాయలు చెల్లించాలి.
గతంలో ౩౦౦ అడుగుల వెడల్పుతో 338 కిలోమీటర్ల మేర రీజినల్ రింగురోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాని ఆ ౩౦౦ అడుగుల వెడల్పు ఉన్న రోడ్డు భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ ను తట్టుకునే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో 500 అడుగుల వెడల్పుతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ రీజినల్ రింగురోడ్డును సాధారణ రహదారిగా కాకుండా ప్రపంచస్థాయి ఎక్స్ప్రెస్వేగా నిర్మించాలని అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఆ దిశగా డీపీఆర్ తయారుచేయాలని, దీనికి నిధుల మంజూరు కోసం కేంద్రంతో మాట్లాడుతానని చెప్పారు. సీఎం గురువారం ప్రగతిభవన్లో సీఎస్ ఎస్కే జోషి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి ఇతర అధికారులతో సమావేశమై రీజినల్ రింగురోడ్డుపై చర్చించారు. రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కూడా సీఎం ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్ నగరం దేశంలోనే గొప్ప కాస్మోపాలిటన్ నగరం. ఇక్కడి వాతావరణ అనుకూలత , సామరస్య జీవన విధానం కారణంగా ఈ నగరం ఇంకా అభివృద్ది చెందుతుంది. దేశం నలుమూలల నుంచి హైదరాబాద్కు రాకపోకలు పెరుగుతాయి. ఇప్పుడున్న ఔటర్ రింగురోడ్డు భవిష్యత్ అవసరాలను తీర్చలేదు. కాబట్టి హైదరాబాద్ చుట్టూ మరో రింగురోడ్డును రీజినల్ రింగురోడ్డు పేరుతో (RRR-Regional Ring Road) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సంగారెడ్డి- గజ్వేల్- చౌటుప్పల్- మాల్- కడ్తాల్- షాద్నగర్- చేవెళ్ల- కంది పట్టణాలను కలుపుతూ 338 కిలోమీటర్ల మేర 500 అడుగుల వెడల్పుతో ఈ రహదారి నిర్మాణం జరుగాలి. ముంబై- పుణె, అహ్మదాబాద్- వడోదర మధ్య ప్రస్తుతమున్న ఎక్స్ప్రెస్వేల కంటే మన రీజినల్ రింగురోడ్డు గొప్పగా ఉండాలి. విజయవాడ, ముంబై, బెంగళూరు, నాగపూర్ నగరాలకు వెళ్లే మార్గంలో జంక్షన్లను బాగా అభివృద్ధి చేయాలి. ఆ నాలుగు జంక్షన్ల్ల వద్ద ప్రభుత్వం 300 ఎకరాల నుంచి 500 ఎకరాల వరకు సేకరిస్తుంది. ఆ స్థలంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. అక్కడ పార్కింగ్, ఫుడ్కోర్టులు, రెస్ట్రూంలు, పార్కులు, పిల్లల ప్లే ఏరియా, షాపింగ్ మాల్స్, మంచినీరు, టాయిలెట్లు.. ఇలా అన్ని రకాల వసతులుండాలి. దేశంలోనే ఈ రహదారి అతిగొప్ప రహదారిగా ఉండాలి. ఇందుకోసం మంచి రహదారులు, రహదారుల పక్కన సకల సౌకర్యాలు కలిగిన దేశాల్లో పర్యటించి అధ్యయనం చేయాలి అని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.
ఐ టి వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో రాజేంద్రనగర్ వద్ద మరో ఐ టి హబ్ ను ప్రారంభించాలని ఐటి మంత్రి నిర్ణయించారు. ఒక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ మాధాపూర్, కొండాపూర్, గోపన్నపల్లి లతో శేరిలింగంపల్లి ఐ టి హబ్ లాగ రాజేంద్రనగర్ కూడా రాబోయే రోజుల్లో ఐ టి కంపనీలతో కళకళ లాడుతుంది అన్నారు.
బుద్వేలు, కిస్మత్ పూర్ మధ్యలో 350 ఎకరాల భూమిని ఐ టి క్లస్టర్ కోసం గుర్తించామని తెలిపారు. ఇటీవల 28 ఐ టి కంపనీల అధికారులు ఐ టి క్లస్టర్ కోసం కేటాయించిన స్థలాన్నీ సందర్శించి కంపనీలను ఏర్పాటుచేయడానికి అంగీకారం తెలిపారు. ఈ ఐటి కంపనీల ద్వార 1.2 లక్షల మందికి ఉపాది కలుగుతుందని, దీనిని నేనే స్వయంగా సమీక్షిస్తూ రాజేంద్రనగర్ ను అభివృద్ధికి తోడ్పడతానని మంత్రి స్పష్టం చేశారు.
శంషాబాద్, బెంగలూరుల మధ్య వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని రాజేంద్రనగర్ లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
వికారాబాద్ నుండి 42 కి మీ మేర మూసి సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1600 కోట్ల ఖర్చుతో ఆగస్ట్ లో పని ప్రారంభిస్తామని చెప్పారు. మరో 100 కోట్లతో గండిపేట సుందరీకరణ చేసి సిటి నుండి కుటుంబంతో సహా వచ్చి గడిపే విదంగా మాల్స్ , సినిమా హల్లకు అనుమతినిచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి కేటిఆర్ చెప్పారు.
హైటెక్ సిటి ఇనార్బిట్ మాల్ , జూబ్లీహిల్స్ మధ్య ట్రాఫిక్ సులభతరం చేసే ఉద్దేశ్యంతో దుర్గంచెరువు పై నిర్మించే కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రారంభ దశలో ఉన్నది. మార్చి 2019 వరకు కేబుల్ బ్రిడ్జ్ పూర్తి కానున్నది. ప్రస్తుతం ఇలాంటి కేబుల్ బ్రిడ్జ్ నర్మద నదిపై బరుచ్ జిల్లా గుజరాత్ లో 1.4 కి.మీ పొడవున నిర్మించారు.
నర్మద నదిపై గుజరాత్ లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి
హైదరాబాద్ దుర్గంచెరువు పై 754.38 మీటర్ల కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 184 కోట్లు ఖర్చు చేయనున్నారు. 13 ఫౌండేషనులు వేస్తె , 12 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. ఈ బ్రిడ్జ్ పూర్తయితే మాధాపూర్,జూబ్లీహిల్స్ ల మధ్య ట్రాఫిక్ సమస్య తగ్గడమే కాకుండ సందర్శకులకు విందు చేయనుంది.
దీనికి ఉపయోగించే కేబుల్స్ ప్రత్యేకంగా ఆస్ట్రేలియా నుండి తెప్పించారు. దీనికి సంబందించిన ప్రీ కాస్ట్ వర్క్ అంతా కొందాపూర్ లో నడుస్తుంది.
నర్మద నదిపై గుజరాత్ లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ను వీడియో లో చూడవచ్చు.