🔹 దేశ క్రీడా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలి
🔹 స్పోర్ట్స్ యూనివర్సిటీపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దేశ క్రీడా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఫోర్త్ సిటిలో భాగంగా తలపెట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై ఉన్నతాధికారులతో చర్చించారు. రకరకాల క్రీడలు, అకాడమీలు, పాఠశాలలు, క్రీడా శిక్షణా సంస్థలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తేవడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రూపుదిద్దుకోవాలని ఆదేశించారు.దశాబ్దాల కిందటే ఆఫ్రో-ఏసియన్ గేమ్స్ కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ భవిష్యత్తులో ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా నిలవాలని ముఖ్యమంత్రి అభిలషించారు.ఒలింపిక్స్ నిర్వహించడమే కాకుండా మన క్రీడాకారులు పతకాలను దక్కించుకునేలా వర్సిటీని తీర్చిదిద్దాలని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిపుణులైన శిక్షకులతో శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు.మన దేశం నుంచి ఒలింపిక్స్లో రాణించే షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, అర్చరీ, జావెలిన్ త్రో, హాకీకి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాత శిక్షణ ద్వారా పతకాలు సాధించే అవకాశాలు ఉన్న మిగతా క్రీడల్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు.చిన్న తనంలోనే విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను ఉపాధ్యాయలు గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాంటి విద్యార్థులందరికీ ఆయా క్రీడల్లో శిక్షణ ఇచ్చేలా ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. ఆ పాఠశాలల్లో విద్యా బోధనతో పాటు క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా శిక్షణ ఇప్పించాలన్నారు.ఒలింపిక్స్లో పతకాలు సాధించిన దేశాలు, క్రీడాకారుల వివరాలను సేకరించి, క్రీడాకారులు శ్రమించిన తీరు, క్రీడల పట్ల ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.యంగ్ ఇండియాకు తెలంగాణ ఒక బ్రాండ్ గా మారాలని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టిన తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీకి కూడా యంగ్ ఇండియా పేరును ఖరారు చేసిన విషయాన్ని వారు గుర్తుచేశారు.
జిహెచ్ఎంసీ కి 3065 కోట్లు, జలమండలికి 3385 కోట్లు, మూసి సుందరీకరణ 1500 కోట్లు, ఎం ఎం టి ఎస్ 50 కోట్లు, హెచ్ ఎం డి ఏ 500 కోట్లు, హైడ్రా 200 కోట్లు, ఎయిర్ పోర్ట్ మెట్రో 100 కోట్లు, హైదరాబాద్ మెట్రో 500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రో 500 కోట్లు, ఓఆర్ఆర్ 200 కోట్లు నిధుల కేటాయింపు
మెట్రో రైలు విస్తరణ కోసం సమగ్ర ప్రణాళిక
హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత మెట్రో రైలు విస్తరణ ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళిక కనెక్టివిటీని మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, మరియు సుస్థిర పట్టణ అభివృద్ధికి తోడ్పడడం లక్ష్యంగా ఉంది. ప్రస్తుత మెట్రో మార్గాలను పాత నగరం మరియు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిపేలా విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టుల కొరకు కేటాయింపు:
పాత నగరం మెట్రో విస్తరణ: రూ 500 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్: రూ 500 కోట్లు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విస్తరణ: రూ 100 కోట్లు
ఇతర రవాణా మార్గాలతో సమర్థవంతమైన అనుసంధానం, ప్రయాణికుల సౌలభ్యం మరియు సమర్థవంతమైన ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం అధునాతన సాంకేతికతల స్వీకరణపై దృష్టి పెట్టనున్నారు.
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కోసం నిధుల కేటాయింపు
రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్ట్ నగర కేంద్రాన్ని రద్దీ చేయకుండా చేసేందుకు మరియు ప్రాంతీయ సమతుల అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ 1,525 కోట్లు కేటాయించింది. ఆర్ఆర్ఆర్ నగర చుట్టూ ట్రాఫిక్ ప్రవాహం సాఫీగా ఉండేలా చేయడం, ప్రధాన రహదారులను అనుసంధానం చేయడం మరియు పర్యవసాన ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడం. ఈ ప్రాజెక్ట్ సురక్షితంగా మరియు సమర్థవంతంగా ఉండేందుకు సర్వీస్ రోడ్లు, ఫ్లైఓవర్లు మరియు అండర్పాస్లు వంటి సహాయ మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా కలిగి ఉంటుంది.
మూసి నది శుభ్రత మరియు సుందరీకరణ కోసం సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)
మూసి రివర్ఫ్రంట్ ప్రాజెక్ట్ ఒక ప్రాముఖ్యత కలిగిన పర్యావరణ మరియు పట్టణ అభివృద్ధి కార్యక్రమం, దీని బడ్జెట్ కేటాయింపు రూ 1,500 కోట్లు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) క్రింది భాగాలను కలిగి ఉంటుంది:
నది శుభ్రత: కాలుష్యాలను తొలగించి నది యొక్క పర్యావరణ సంతులనం పునరుద్ధరించడానికి అధునాతన నీటి శుద్ధి సాంకేతికతలను అమలు చేయడం.
సుందరీకరణ: నది తీరం పక్కన పార్కులు, ప్రొమెనేడ్లు మరియు వినోద ప్రాంతాల అభివృద్ధి చేయడం ద్వారా అందాన్ని మెరుగుపరచడం మరియు ప్రజలకు బహిరంగ ప్రదేశాలను అందించడం.
తెలంగాణ ప్రభుత్వం నగర చుట్టూ శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణాన్ని ప్రోత్సహించే ప్రణాళికలను ప్రకటించింది, ఇవి ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నట్లుగా, ఈ టౌన్షిప్లలో పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలతో తక్కువ ధరలో నివాస గృహాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మెట్రో రైలును పొడిగించి, నగరంలోని వివిధ వర్గాల అవసరాలను పరిష్కరించడం ద్వారా, నగరంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం 24,042 కోట్ల అంచనా వ్యయంతో 78.4 కిలోమీటర్ల మేర ఐదు అదనపు మెట్రో కారిడార్లను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా, ఓల్డ్ సిటీ వరకు మెట్రో రైలును పొడిగించి, శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేయనున్నారు.
కాగా, నాగోల్, ఎల్బీనగర్ నుంచి మెట్రోను పొడిగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నాగోల్, ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట మెట్రో స్టేషన్లను ఇంటర్ఛేంజ్ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఎల్బీ నగర్ నుంచి హయత్నగర్ వరకు, మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రో రైలు సౌకర్యాలను పొడిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేస్తోంది. అదనంగా, హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలను కోర్ అర్బన్ ప్రాంతాలుగా గుర్తించి, వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డును హైదరాబాద్ మెట్రో సిటీకి సరిహద్దుగా పరిగణించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో విపత్తు నిర్వహణ కోసం ఏకీకృత సంస్థను ఏర్పాటు చేయడంతోపాటు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలను దాని పరిధిలోకి చేర్చేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఈ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉంటుంది. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, నదీతీరంలో కొత్త వాణిజ్య మరియు నివాస కేంద్రాలను ఏర్పాటు చేయడం మరియు పాత వారసత్వ ప్రాంతాల శోభను పెంపొందించడం కోసం కృషి చేస్తోంది.
లండన్లోని థేమ్స్ నది తరహాలో మూసీ నది మరియు దాని పరిసర ప్రాంతాలను పునరుజ్జీవింపజేయడం, అభివృద్ధి చేయడం మరియు సుందరీకరించడం లక్ష్యంగా పెట్టుకున్న మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం, ప్రభుత్వం మొదటి దశకు రూ.1,500 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్లో రిక్రియేషనల్ జోన్లు, పాదచారుల జోన్లు, పిల్లల థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు మరియు పీపుల్స్ ప్లాజాల అభివృద్ధి ఉంటాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కోసం రూ.3,065 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.500 కోట్లు మరియు మెట్రో వాటర్ పనులకు రూ.3,385 కోట్లు కేటాయించారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో రైల్ విస్తరణకు బడ్జెట్లో రూ.100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రో పొడిగింపుకు రూ.500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు రవాణా వ్యవస్థకు రూ.50 కోట్లు కేటాయించారు.
ఉత్తర ప్రాంతంలోని సంగారెడ్డి నుంచి తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ వరకు 158.6 కిలోమీటర్ల రహదారిని మరియు దక్షిణ ప్రాంతంలోని చౌటుప్పల్ నుంచి షాద్నగర్, సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారి హోదాగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణ ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)ను ప్రారంభంలో నాలుగు లేన్లతో నిర్మించి, తర్వాత ఎనిమిది లేన్లుగా విస్తరించాలని యోచిస్తోంది.
ముందస్తు అంచనాల ప్రకారం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర ప్రాంత అభివృద్ధికి రూ.13,522 కోట్లు మరియు దక్షిణాది అభివృద్ధికి దాదాపు రూ.12,980 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కోసం రూ.1,525 కోట్లు కేటాయించారు. చారిత్రాత్మకంగా, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరాన్ని పద్దతిగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
హైదరాబాద్ కు అంతర్జాతీయ ఐటి కంపనీల వరద పెరిగింది. డజనుకు పైగా ప్రముఖ అంతర్జాతీయ ఐటి కంపనీలు ఐటి స్థావరంగా ఉన్న పశ్చిమ హైదరాబాద్ లో అడ్డా వేస్తున్నాయి. ఇలా వచ్చిన కంపనీలలో కొన్ని భారత్ లో మొదటి కార్యలయలున్నాయి. భారత్ లో అడుగుపెట్టాలనుకున్న ఐటి కంపనీలు ఇలా హైదరాబాద్ లోనే తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి.
అమెరికాకు చెందిన ష్యూర్, మైక్రాన్ టెక్నాలజీ, ఎఫ్5 నెట్వర్క్స్, మ్యాథ్వర్క్స్, క్లీన్ హార్బర్స్, కాండ్యూయెంట్, లెగాతో హెల్త్ టెక్నాలజీస్, త్రైవ్ డిజిటల్, బాంబార్డియర్ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చైనాకు థందర్ సాఫ్ట్ వేర్ టెక్ గత వారంలో ప్రారంభించబడింది. ఇంకా చాలా సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించటానికి సంప్రదింపులు జరుపుతున్నాయి.
ఐటి కంపనీలకు అనువైన వాతావరణం, మౌలికసదుపాయాలు కల్పన, సాంకేతిక నిపుణుల లభ్యత పుష్కలంగా హైదరాబాద్ లో ఉండడం వల్ల కంపనీలు క్యూ కడుతున్నాయి. ఇంకా ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండడం వల్ల కంపనీలు వరదలా వచ్చిపడుతున్నాయి.
ఇలా కంపనీలు రావడం వల్ల ఉద్యోగఅవకాశాలు పెరగడమే కాకుండా కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లకు గిరాకి పెరుగుతుంది.
ఇదివరకు ఏదైనా కంపనీ భారత్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటే బెంగలూరు లో కార్యాలయాలను ఏర్పాటుచేసుకునేది. ఇప్పుడు రూటు మార్చి హైదరాబాద్ లో ఆఫీసులను పెడుతున్నాయి.
హైదరాబాద్లో నగరవాసులకు ట్రాఫిక్ నుండి కాస్త ఊరట లభించినట్లే. అమీర్పేట, ఎల్బీ నగర్ మధ్య ప్రయాణించే వారికి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మెట్రో కల నిజమయింది. అమీర్పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు ప్రయాణం ప్రారంభం అయింది. గవర్నర్ నరసింహన్ అమీర్ పేట మెట్రో స్టేషన్లో జెండా ఊపి మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ తదితరులు అమీర్పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు ప్రయానించారు.
ఎల్బీనగర్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మెట్రో రైలు సేవలను వినియోగించుకోవడం ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, తద్వారా కాలుష్యాన్ని సైతం నియంత్రించవచ్చన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రతి మెట్రో స్టేషన్ను తీర్చిదిద్దామని, వీటి నిర్మాణంలో అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించామన్నారు.
ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతాచోట్ల ఇప్పటివరకు పార్కింగ్ వసతులు అందుబాటులో లేవు. మెట్రో స్టేషన్ పార్కింగ్ వసతి లేని చోట స్టేషన్ కు కొద్ది దూరంలో ఫ్రీ పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయడమైనది.
ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కిలో మీటర్ల మియాపూర్ కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి.
హైదరాబాద్ మెట్రో కారిడార్ 1 మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు మొత్తం 27 కిలోమీటర్లు. ఇందులో మియాపూర్ నుండి అమీర్పేట వరకు మొదటి దశలో ప్రారంభించారు. ఇంకా కారిడార్ ౩ నాగోల్ నుండి రాయదర్గ వరకు మొత్తం 29 కిలోమీటర్లు ఇందులో నాగోల్ నుండి అమీర్ పేట వరకు మొదటి దశలో ప్రారంభించారు. రెండో దశగా కారిడార్ 1లో అమీర్ పేట నుండి ఎల్బీనగర్ వరకు ఇప్పుడు ప్రారంభించారు. మొత్తానికి కారిడార్ 1 మొత్తం పూర్తయింది. కారిడార్ ౩ లో అమీర్పేట నుండి హైటెక్ సిటి వరకు ఈ ఏడాది నవంబర్ లో పూర్తీ కావచ్చని అధికారులు చెపుతున్నారు.
గతంలో ౩౦౦ అడుగుల వెడల్పుతో 338 కిలోమీటర్ల మేర రీజినల్ రింగురోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాని ఆ ౩౦౦ అడుగుల వెడల్పు ఉన్న రోడ్డు భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ ను తట్టుకునే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో 500 అడుగుల వెడల్పుతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ రీజినల్ రింగురోడ్డును సాధారణ రహదారిగా కాకుండా ప్రపంచస్థాయి ఎక్స్ప్రెస్వేగా నిర్మించాలని అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఆ దిశగా డీపీఆర్ తయారుచేయాలని, దీనికి నిధుల మంజూరు కోసం కేంద్రంతో మాట్లాడుతానని చెప్పారు. సీఎం గురువారం ప్రగతిభవన్లో సీఎస్ ఎస్కే జోషి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి ఇతర అధికారులతో సమావేశమై రీజినల్ రింగురోడ్డుపై చర్చించారు. రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కూడా సీఎం ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్ నగరం దేశంలోనే గొప్ప కాస్మోపాలిటన్ నగరం. ఇక్కడి వాతావరణ అనుకూలత , సామరస్య జీవన విధానం కారణంగా ఈ నగరం ఇంకా అభివృద్ది చెందుతుంది. దేశం నలుమూలల నుంచి హైదరాబాద్కు రాకపోకలు పెరుగుతాయి. ఇప్పుడున్న ఔటర్ రింగురోడ్డు భవిష్యత్ అవసరాలను తీర్చలేదు. కాబట్టి హైదరాబాద్ చుట్టూ మరో రింగురోడ్డును రీజినల్ రింగురోడ్డు పేరుతో (RRR-Regional Ring Road) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సంగారెడ్డి- గజ్వేల్- చౌటుప్పల్- మాల్- కడ్తాల్- షాద్నగర్- చేవెళ్ల- కంది పట్టణాలను కలుపుతూ 338 కిలోమీటర్ల మేర 500 అడుగుల వెడల్పుతో ఈ రహదారి నిర్మాణం జరుగాలి. ముంబై- పుణె, అహ్మదాబాద్- వడోదర మధ్య ప్రస్తుతమున్న ఎక్స్ప్రెస్వేల కంటే మన రీజినల్ రింగురోడ్డు గొప్పగా ఉండాలి. విజయవాడ, ముంబై, బెంగళూరు, నాగపూర్ నగరాలకు వెళ్లే మార్గంలో జంక్షన్లను బాగా అభివృద్ధి చేయాలి. ఆ నాలుగు జంక్షన్ల్ల వద్ద ప్రభుత్వం 300 ఎకరాల నుంచి 500 ఎకరాల వరకు సేకరిస్తుంది. ఆ స్థలంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. అక్కడ పార్కింగ్, ఫుడ్కోర్టులు, రెస్ట్రూంలు, పార్కులు, పిల్లల ప్లే ఏరియా, షాపింగ్ మాల్స్, మంచినీరు, టాయిలెట్లు.. ఇలా అన్ని రకాల వసతులుండాలి. దేశంలోనే ఈ రహదారి అతిగొప్ప రహదారిగా ఉండాలి. ఇందుకోసం మంచి రహదారులు, రహదారుల పక్కన సకల సౌకర్యాలు కలిగిన దేశాల్లో పర్యటించి అధ్యయనం చేయాలి అని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.
హైదరాబాద్ హెచ్ఎండిఏ (HMDA)పరిధిలో 28 కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ శివారులో గ్రామపంచాయితీలు గా ఉండి, జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన ప్రభుత్వం, వాటిని కొత్త మున్సిపాలిటీలుగా మార్చింది.
మెదక్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు, మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, రంగారెడ్డి జిల్లాలో 8 మున్సిపాలిటీలు, సంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపాలిటీలు, యాదాద్రి భువనగిరి జిల్లా (2) కొత్తగా వెలిశాయి. అదే యాదాద్రి జిల్లాలో వైటిడిఏ (YTDA)పరిధిలో యాదగిరిగుట్టను కూడా మున్సిపాలిటీ చేశారు.
సంగారెడ్డి జిల్లా (౩) : బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్
యాదాద్రి భువనగిరి జిల్లా (2+1) : చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట
పైన చెప్పిన ప్రాంతాలలో రోడ్లు మరియు ఇతర ప్రజా సౌకర్యాలు మెరుగుపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతాలలో ప్లాట్ల పై పెట్టుబడి ఎక్కువ లాభాలను ఇస్తుంది.
కెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్ అస్సేట్ మేనేజ్మెంట్ కంపెని 100 మిలియన్ డాలర్లను ఇంకర్ అనే హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ యొక్క రెసిడెన్షియల్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టింది.
గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ ఫండ్ పెట్టుబడిదారులు భారతదేశంలోని రెసిడెన్షియల్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారు. ఈ సమయంలో, దేశంలో రియల్ ఎస్టేట్ లో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్ లో నిర్మాణాత్మక పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు.
హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఇంకర్ (INCOR) కొంపల్లిలో నిర్మించే రెసిడెన్షియల్ ప్రాజెక్టులలో 100 మిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.687 కోట్లు) బ్రూక్ ఫీల్డ్ యొక్క 4.5 బిలియన్ డాలర్ల గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ ఫండ్ నుండి పెట్టుబడి పెట్టబడింది. ఈ ప్రాజెక్టు 12 ఎకరాలలో 1100 అపార్ట్ మెంట్ లు 60 లక్షల చదరపు అడుగులతో నిర్మాణం చేయబోతున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ కు సాక్ష్యంగా నిలిచింది.దేశంలోని మిగత నగరాలలో రియల్ ఎస్టేట్ వెనకడుగులో ఉన్నప్పుడు మంచి రాబడులను ఇచ్చిన ఏకైక నగరం హైదరాబాద్.
అనరాక్ కన్సల్టెన్సీ వారి పరిశోదన ప్రకారం, భారత దేశంలోని ఏడు అతి పెద్ద నగరాలలో హైదరాబాద్ మాత్రమే 2013-14 నుండి 2017 వరకు 34% వృద్ధి సాధించింది. ధిల్లీ, ముంబై, పూణే, చెన్నై, కోల్ కతా లలో అమ్మకాలు పడిపోయాయి. ధిల్లీ NCR లో అత్యధికంగా 67% తగ్గాయి. బెంగళూరులో 21% తగ్గాయి.