
భవిష్య రియాల్టర్స్ మరియు NSA అవెన్యూ అనే రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు కలిసి మహేశ్వరంలో 17 ఎకరాల స్థలంలో విల్లా ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాయి. ఆసక్తి ఉన్నవారు అడ్వాన్సులు చెల్లించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అందరూ వారు చెల్లించవలసిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించారు. ఆ తర్వాత స్థలానికి సంబంధించిన పత్రాలు చూపాలని కోరగా ధరణి వెబ్సైట్ తెరుచుకోవడం లేదని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని తప్పించుకున్నారు.
గత నెలలోడబ్బులు చెల్లించిన కొనుగోలుదారులు ఆ స్థలాన్ని సందర్శించగా ఆ స్థలం బిల్డర్లది కాదని తేలింది. దీంతో బిల్డర్లు మోసం చేశారని సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.
#Hyderabad #Prelaunchscam #hyderabadrealestate
368 total views, 3 views today