యాదగిరిగుట్ట వైటిడిఏ మాస్టర్ ప్లాన్ లో విశేషాలు

యాదగిరిగుట్టను అన్ని సౌకర్యాలతో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో  సిఎం కేసిఆర్ గుట్ట అభివృద్ధి పనులను యజ్ఞం లా చేయిస్తున్నారు.     యాదగిరిగుట్టను గొప్ప  ఆద్యాత్మిక యాత్ర స్థలంగా అభివృద్ధి చేయడానికి   యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ను   (వైటిడిఏ -యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి సాధికార సంస్థ) ఏర్పాటు చేసారు. వైటిడిఏ పరిధి లో ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి, ఎలా అభివృద్ధి చేయాలో తెలియజేసే వైటిడిఏ మాస్టర్ ప్లాన్ తయారు చేశారు.

యాదగిరిపల్లి, గుండ్లపల్లి, రాయగిరి, సైదాపూర్, మల్లాపూర్, దాతార్ పల్లి, బస్వాపూర్  అనే ఏడు గ్రామాలతో 104.58 చ.కి.మీ ల పరిధి తో వైటిడిఏ ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పున ఆలేరు, పశ్చిమాన తుర్కపల్లి, ఉత్తరాన రాజాపేట, దక్షిణాన భువనగిరి మండలాలున్నాయి .

యాదగిరిగుట్ట దేవాలయ  అభివృద్ధి కోసం 1391. 09 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఆ భూమిని కింది తెలిపిన విధంగా కేటాయించారు .

1.  టెంపుల్ సిటి ఫేజ్ – II                 – 614.11 ఎకరాలు
2. టెంపుల్ సిటి ఫేజ్ – I     – 234.02 ఎకరాలు
3. అటవీ ప్రాంతం                                       – 87.06 ఎకరాలు
4. కొత్తగా భూ సేకరణ ప్రతిపాదిత ప్రాంతం – 132.09 ఎకరాలు
5. ఫ్యూచర్ ఎక్స్టెన్షన్                   – 106.31 ఎకరాలు
6. కొత్తగా భూ సేకరణ ప్రతిపాదిత ప్రాంతం   – 6.24 ఎకరాలు
7.  గండి చెరువు                          – 34.07 ఎకరాలు
8. కొండ ప్రాంతం                       – 11.04 ఎకరాలు
9. స్వామీ వారి ఉద్యానవనం    – 25 ఎకరాలు
10. కళ్యాణమండపం                 -25.36 ఎకరాలు                                                                     11. వివిఐపి కాటేజీలు                – 13.26 ఎకరాలు                                                                     12. ఖాళి స్థలం                           – 20.11 ఎకరాలు
13.  అర్చకుల & దేవాలయ ఉద్యోగుల గృహ సముదాయం  – 9.22 ఎకరాలు                       14. 200 రూములు &  డార్మిటరి – 15.15 ఎకరాలు                                                                 15. 7000 కార్ పార్కింగ్               – 37.38 ఎకరాలు
16. బస్ టర్మినల్ & షాపింగ్      – 14.27 ఎకరాలు
17. ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్               – 1 ఎకర

ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా

భవిష్యత్తులో పెరగబోయ రద్దీ ని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు , సమీప రైల్వే రైల్వే స్టేషన్ ఆధునీకరణ, మెట్రో రైలు సౌకర్యం, పాదచారులకు నడకదారులు, సైకిల్ లాంటి  మోటారు యేతర వాహనాలకు ప్రత్యేకమైన రోడ్లు ఏర్పాటుకు  ప్రణాలికలు  వైటిడిఏ మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నారు.

రద్దీని ఎదుర్కొనే విశాలమైన రోడ్లు,రింగ్ రోడ్లు

యాదగిరిగుట్టను కలిపే  రాయగిరి రోడ్డు , కీసర రోడ్డు, రాజాపేట రోడ్డు,వంగపల్లి రోడ్లను  వెడల్పు పెంచి 4 ట్రాకులతో 150 అడుగుల రోడ్లు వేస్తారు.ఈ 4 రోడ్లను కలుపుతూ 150 అడుగుల రింగు రోడ్డును వేస్తారు.     

 

 

 

 

 

 

 

 

 

 

టూరిజం కాన్సెప్ట్ తో  కారిడార్లు 

యాదగిరిగుట్టలో పంచ నరసింహ స్వామీ, పంచ భూతాలూ జత చేసి ఐదు కారిడార్లు ఏర్పాటు చేసి ఒక్కో కారిడార్ కు పంచ భూతాలలో ఒక పేరు పెట్టి, ప్రతీ కారిడార్ ప్రవేశంలో మహా ద్వారాన్ని నిర్మిస్తారు.

పంచ నరసింహ స్వామి కేత్రం           పంచ భూతాలు
యోగనంద నరసింహ అవతారం            గాలి
లక్ష్మీ నరసింహ అవతారం                       నీరు
ఉగ్ర నరసింహ అవతార్                            ఆకాశం
గండబేరుండ నరసింహ అవతారం        అగ్ని
జ్వాలా నరసింహ అవతారం                     భూమి

ఐదు కారిడార్ల అభివృద్ధి:
1. జాతీయ రహదారి 169 నుండి దేవస్థానం                                                                               2. తుర్కపల్లి నుండి దేవస్థానం                                                                                                       ౩.రాజాపేట నుండి దేవస్థానం
4. వంగపల్లి నుండి దేవస్థానం
5. పాతగుట్ట నుండి దేవస్థానం

ఎక్కువ రద్దీ ఉండే మొదటి రెండు కారిడార్లు అయిన జాతీయ రహదారి 169 నుండి దేవస్థానం వచ్చే కారిడార్, తుర్కపల్లి నుండి దేవస్థానం వచ్చే కారిడార్ లలో  పాదచారులకు నడకదారులు, సైకిల్ లాంటి  మోటారు యేతర వాహనాలకు ప్రత్యేకమైన రోడ్లు ఏర్పాటు చేస్తారు.

మరిన్ని విశేషాలు… త్వరలో……

12,892 total views, 3 views today