హెచ్ఎండిఏ ల్యాండ్ పూలింగ్ కోసం ప్రత్యేక ప్రణాళిక

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్ ద్వారా వేయి ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

అవుటర్ రింగ్ రోడ్డుకు, ప్రాంతీయరింగ్ రోడ్డుకు మధ్య లేఔట్ లు అభివృద్ధి చేసి వేలం వేస్తే హెచ్ఎండిఏకు ఆదాయంతోపాటు, మధ్యతరగతి వారికి ధరలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్ ద్వారా వేయి ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇన్ ముల్ నర్వ లో 95.25 ఎకరాల్లో లేఔట్ అభివృద్ధి చేసి, లేమూరులో 83.48 ఎకరాల్లో లేఔట్లను అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు.

హెచ్ఎండిఏ లేఅవుట్ల కోసం గుర్తించిన భూముల్లో దాదాపు సాగులో లేనివే. అవి అసైన్డ్ కేటగిరీలో ఉండటంతో రైతులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సేకరించిన భూమిని హెచ్ఎండిఏ అభివృద్ధి చేసి లేఅవుట్ కింద తీర్చిదిద్దుతుంది. రైతు భూ యజమానిగా, హెచ్ఎండిఏ డెవలపర్ గా ఉంటుంది. ఇందులో రైతులకు 60 శాతం బదిలీ చేస్తుంది. మిగతా 40 శాతం హెచ్ఎండిఏ విక్రయిస్తుంది. ల్యాండ్ పూలింగ్ లో భాగంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్గిరి పరిధిలో దాదాపు 924.28 ఎకరాలు అధికారులు పరిశీలించారు.

ఆదాయం పెంపు దిశగా అడుగులు

హెచ్ఎండిఏ పై ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి సారించింది. రూ. 500 కోట్ల వరకు మౌలిక వసతులకు కేటాయించింది. అవుటర్ రింగ్ రోడ్డుకు, ప్రాంతీయరింగ్ రోడ్డుకు మధ్య లేఔట్ లు అభివృద్ధి చేసి వేలం వేస్తే హెచ్ఎండిఏకు ఆదాయంతోపాటు, మధ్యతరగతి వారికి ధరలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ లో 355, బోగారంలో 125, ప్రతాప్సింగారంలో 152, నాదర్గుల్ లో 91 ఎకరాల్లో లేఅవుట్లు తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

187 total views, 3 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *