హైదరాబాద్ లో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు

Hyderabad Updates, CM, KCR, UAE Minster, IT Minister, KTR
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వ్యవహారాలు  మరియు అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశం

హైదరాబాద్ నగరంలో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు కూడా కల్పించనున్నది .

గురువారం ప్రగతి భవన్ లో  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వ్యవహారాలు  మరియు అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో  హైదరాబాద్ లో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు గురించి చర్చలు జరిపారు.యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, యుఎఇల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి, యుఎఇ మంత్రికి చెప్పారు. దీనికి యుఎఇ  విదేశీ వ్యవహారాల మంత్రి స్పందిస్తూ కాన్సులేట్ ఏర్పాటుకు అంగీకరించినట్టు అధికారులకు సూచనలు ఇచ్చారు.

వివిధ దేశాల నుంచి ప్రజలు వైద్య చికిత్స కోసం ఇక్కడకు వచ్చారు. హైదరాబాద్ వైద్య పర్యటనకు  గమ్యస్థానంగా ఉందని యుఎఇ మంత్రికి కేసీఆర్ వివరించారు.
తెలంగాణాలో ‘వ్యాపారం చేయడం సులభం’ గురించి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్  వివరించారు. “దేశం యొక్క తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది” అని ఆయనకు తెలిపాడు.

7,520 total views, 3 views today

హైదరాబాద్ లో రాజేంద్రనగర్ వద్ద మరో ఐ టి క్లస్టర్

hyderabad updates, hitec city hyderabad, rajendranagar, serilingampalli
హైటెక్ సిటి హైదరాబాద్ (పాత చిత్రం)

ఐ టి వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో రాజేంద్రనగర్ వద్ద మరో ఐ టి హబ్ ను ప్రారంభించాలని ఐటి మంత్రి నిర్ణయించారు. ఒక సమావేశంలో కేటీఆర్  మాట్లాడుతూ  మాధాపూర్, కొండాపూర్, గోపన్నపల్లి లతో  శేరిలింగంపల్లి ఐ టి హబ్ లాగ రాజేంద్రనగర్ కూడా రాబోయే రోజుల్లో ఐ టి కంపనీలతో కళకళ లాడుతుంది అన్నారు.

బుద్వేలు, కిస్మత్ పూర్ మధ్యలో 350 ఎకరాల భూమిని ఐ టి క్లస్టర్ కోసం గుర్తించామని తెలిపారు.  ఇటీవల 28  ఐ టి కంపనీల అధికారులు ఐ టి క్లస్టర్ కోసం కేటాయించిన స్థలాన్నీ సందర్శించి కంపనీలను ఏర్పాటుచేయడానికి అంగీకారం తెలిపారు. ఈ  ఐటి కంపనీల ద్వార 1.2 లక్షల మందికి ఉపాది కలుగుతుందని, దీనిని నేనే స్వయంగా సమీక్షిస్తూ రాజేంద్రనగర్ ను అభివృద్ధికి తోడ్పడతానని మంత్రి స్పష్టం చేశారు.

శంషాబాద్, బెంగలూరుల మధ్య వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని రాజేంద్రనగర్ లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

వికారాబాద్ నుండి 42 కి మీ మేర మూసి సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1600 కోట్ల ఖర్చుతో ఆగస్ట్ లో పని ప్రారంభిస్తామని చెప్పారు. మరో 100 కోట్లతో గండిపేట సుందరీకరణ చేసి సిటి నుండి కుటుంబంతో సహా వచ్చి గడిపే విదంగా మాల్స్ , సినిమా హల్లకు అనుమతినిచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి కేటిఆర్  చెప్పారు.

8,449 total views, no views today

హైదరాబాద్ దుర్గంచెరువు పై కేబుల్ బ్రిడ్జ్

హైటెక్ సిటి ఇనార్బిట్ మాల్ , జూబ్లీహిల్స్ మధ్య ట్రాఫిక్ సులభతరం చేసే ఉద్దేశ్యంతో  దుర్గంచెరువు పై నిర్మించే కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రారంభ దశలో ఉన్నది.  మార్చి 2019 వరకు కేబుల్ బ్రిడ్జ్  పూర్తి కానున్నది. ప్రస్తుతం ఇలాంటి  కేబుల్ బ్రిడ్జ్ నర్మద నదిపై బరుచ్ జిల్లా గుజరాత్ లో 1.4 కి.మీ పొడవున నిర్మించారు.

baruch cable bridge, hyderabad updates
నర్మద నదిపై గుజరాత్ లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి

హైదరాబాద్ దుర్గంచెరువు పై 754.38 మీటర్ల కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 184 కోట్లు ఖర్చు చేయనున్నారు. 13 ఫౌండేషనులు వేస్తె , 12 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. ఈ బ్రిడ్జ్  పూర్తయితే  మాధాపూర్,జూబ్లీహిల్స్ ల మధ్య ట్రాఫిక్ సమస్య తగ్గడమే కాకుండ సందర్శకులకు విందు చేయనుంది.

దీనికి ఉపయోగించే కేబుల్స్ ప్రత్యేకంగా ఆస్ట్రేలియా నుండి తెప్పించారు. దీనికి సంబందించిన ప్రీ కాస్ట్ వర్క్ అంతా కొందాపూర్ లో నడుస్తుంది.

నర్మద నదిపై గుజరాత్ లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ను వీడియో లో చూడవచ్చు.

9,334 total views, no views today

కొత్వాల్ గూడలో సింగపూర్ తరహ నైట్ సఫారి పార్క్

  • 125 ఎకరాలలో సింగపూర్ తరహ నైట్ సఫారి పార్క్
  • బసచేసేందుకు ప్రత్యేక కాటేజ్ ల ఏర్పాటు
సింగపూర్ లోని నైట్ సఫారీ పార్క్

నగరానికి దూరంగా ఎక్కడో అడవిలో  ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారా ?  చీకట్లో సైతం ఎటువంటి అపాయం లేకుండా వన్య ప్రాణుల  మధ్య సంచరించాలనుకుంటున్నారా  ?  అయితే మీ కోరిక హైదరాబాద్ లోనే  నెరవేరబోతుంది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో  కొత్వాల్ గూడలో 125 ఎకరాలలో సింగపూర్ తరహ నైట్ సఫారి పార్క్ ఏర్పాటు చేయడానికి హెచ్ ఎం డి ఏ సన్నాహాలు చేస్తుంది.

హైదరాబాద్ లో

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న కొత్వాల్ గూడను నైట్ సఫారి పార్క్ ఏర్పాటు చేయడానికి తగిన స్థలంగా  గుర్తించారు. 80 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇంకా 45 ఎకరాల స్థలం సేకరించవలసి ఉంది. ఈ నైట్ సఫారి పార్క్ కొత్త  అనుభూతులను  అందిస్తుంది అనడం లో  ఎలాంటి సందేహం లేదు. ఇది భాగ్యనగరానికే తలమానికంగా నిలుస్తుందని హెచ్ఎండిఏ కమీషనర్ చిరంజీవులు అన్నారు.

సింగపూర్ లో నైట్ సఫారి పార్క్ ఎలా ఉంటుందో కింది విడియోలో చూడవచ్చు

 

7,600 total views, no views today